Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:32 PM

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం
07-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభివృద్ధి అంశాలపై సమావేశం

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు భూ సేకరణ కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మూడు ప్రాంతాల్లో ఎదురవుతున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొనే లో వోల్టేజ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా మెరుగుపర్చాలని అధికారులను కోరారు.

సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం

Article Image

అభివృద్ధి అంశాలపై సమావేశం

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు భూ సేకరణ కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మూడు ప్రాంతాల్లో ఎదురవుతున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొనే లో వోల్టేజ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా మెరుగుపర్చాలని అధికారులను కోరారు.

సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News