Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 05:12 PM

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం
March 07, 2026 03:36 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

అభివృద్ధి అంశాలపై సమావేశం

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు భూ సేకరణ కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మూడు ప్రాంతాల్లో ఎదురవుతున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొనే లో వోల్టేజ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా మెరుగుపర్చాలని అధికారులను కోరారు.

సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News