Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోతులు, వీధికుక్కల బెడదపై బీఆర్ఎస్ ఆందోళన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 12:42 PM

నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బి. వంశీకృష్ణ బాధ్యతల స్వీకరణ

నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బి. వంశీకృష్ణ బాధ్యతల స్వీకరణ

నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బి. వంశీకృష్ణ బాధ్యతల స్వీకరణ
July 21, 2026 12:37 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ప్రభుత్వ బదిలీ ఉత్తర్వుల మేరకు పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్

ప్రజలకు మెరుగైన సేవలు, నగర అభివృద్ధే లక్ష్యం: కమిషనర్ బి. వంశీకృష్ణ

నల్లగొండ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా బి. వంశీకృష్ణ సోమవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ బదిలీ ఉత్తర్వుల మేరకు ఆయన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జూన్ 30న పదవీ విరమణ పొందిన మాజీ కమిషనర్ బి. శరత్ చంద్ర స్థానంలో వంశీకృష్ణ నియమితులయ్యారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ బి. వంశీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు, ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడం, నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

నల్లగొండ నగరాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తానని ఆయన చెప్పారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి, వీధి దీపాల నిర్వహణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేస్తానని కమిషనర్ అన్నారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం పెంచుకుని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.

నగర ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. నగర అభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నూతన కమిషనర్ బాధ్యతలు స్వీకరించడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఆయన సమర్థవంతమైన పరిపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News