నల్లగొండ జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసుల దృష్టి – డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు
నల్లగొండ జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసుల దృష్టి – డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన హోర్డింగ్ను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వెలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, పిట్టంపల్లి క్రాస్ వద్ద సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా జాతీయ రహదారిపై ప్రయాణించే గూడ్స్ వాహనాల భద్రతపై కూడా డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గూడ్స్ క్యారియర్ వాహనాలకు తప్పనిసరిగా కస్సాన్ రేడియం స్టిక్కర్లు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి