Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు – కలెక్టర్ అనురాగ్ జయంతి బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 05:37 PM

నల్లగొండలో 'శ్రీ వెంకట రమణ గ్రాండ్' రెస్టారెంట్ ప్రారంభం

నల్లగొండలో 'శ్రీ వెంకట రమణ గ్రాండ్' రెస్టారెంట్ ప్రారంభం

నల్లగొండలో 'శ్రీ వెంకట రమణ గ్రాండ్' రెస్టారెంట్  ప్రారంభం
April 02, 2026 03:01 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ముఖ్య అతిథులుగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా..


నగర అభివృద్ధికి కొత్త శోభ.. మేనేజ్‌మెంట్‌కు అభినందనల జల్లు


నల్లగొండ : వేగంగా విస్తరిస్తున్న నల్లగొండ నగర మకుటంలో మరో మణిహారం చేరింది. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో నూతనంగా నిర్మించిన ‘శ్రీ వెంకట రమణ గ్రాండ్’ హోటల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గౌరవ సమక్షంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హోటల్‌ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అంతకుముందు నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు.


​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ నగరం రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, పెరుగుతున్న పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఇలాంటి ప్రీమియం హోటళ్లు రావడం శుభపరిణామమని కొనియాడారు. అత్యాధునిక సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించే విధంగా హోటల్‌ను తీర్చిదిద్దిన మేనేజ్‌మెంట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, నగరానికి వచ్చే సందర్శకులకు ఉత్తమ సేవలు అందిస్తూ నల్లగొండ ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాంక్షించారు.

​త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధిలో ఆతిథ్య రంగం కీలక పాత్ర పోషిస్తుందని, పర్యాటకులకు మరియు వ్యాపారవేత్తలకు కావాల్సిన అన్ని వసతులు ఒకే చోట లభించడం అభినందనీయమన్నారు. ఈ హోటల్ నగర వాసులకు ఒక కొత్త అనుభూతిని అందించడమే కాకుండా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News