నల్లగొండలో 'శ్రీ వెంకట రమణ గ్రాండ్' రెస్టారెంట్ ప్రారంభం
నల్లగొండలో 'శ్రీ వెంకట రమణ గ్రాండ్' రెస్టారెంట్ ప్రారంభం
NM Yadav
ముఖ్య అతిథులుగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా..
నగర అభివృద్ధికి కొత్త శోభ.. మేనేజ్మెంట్కు అభినందనల జల్లు
నల్లగొండ : వేగంగా విస్తరిస్తున్న నల్లగొండ నగర మకుటంలో మరో మణిహారం చేరింది. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో నూతనంగా నిర్మించిన ‘శ్రీ వెంకట రమణ గ్రాండ్’ హోటల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గౌరవ సమక్షంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హోటల్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అంతకుముందు నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ నగరం రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, పెరుగుతున్న పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఇలాంటి ప్రీమియం హోటళ్లు రావడం శుభపరిణామమని కొనియాడారు. అత్యాధునిక సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించే విధంగా హోటల్ను తీర్చిదిద్దిన మేనేజ్మెంట్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, నగరానికి వచ్చే సందర్శకులకు ఉత్తమ సేవలు అందిస్తూ నల్లగొండ ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాంక్షించారు.
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధిలో ఆతిథ్య రంగం కీలక పాత్ర పోషిస్తుందని, పర్యాటకులకు మరియు వ్యాపారవేత్తలకు కావాల్సిన అన్ని వసతులు ఒకే చోట లభించడం అభినందనీయమన్నారు. ఈ హోటల్ నగర వాసులకు ఒక కొత్త అనుభూతిని అందించడమే కాకుండా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి