PRINT TIME: April 25, 2026 07:34 PM
నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్
నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్
April 25, 2026 05:37 PM
149 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్
నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ATMలను లక్ష్యంగా చేసుకుని లూటీకి పాల్పడిన దొంగల ముఠా హైదరాబాద్ వైపు వస్తోందన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్యాల వద్ద జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలను గమనించిన దొంగలు తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారు ప్రయాణిస్తున్న కారును చిట్యాల శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్లో వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని AP 40 FL 0512 నంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి