Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్
25-04-2026 295 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ATMలను లక్ష్యంగా చేసుకుని లూటీకి పాల్పడిన దొంగల ముఠా హైదరాబాద్ వైపు వస్తోందన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్యాల వద్ద జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీలను గమనించిన దొంగలు తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారు ప్రయాణిస్తున్న కారును చిట్యాల శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని AP 40 FL 0512 నంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

Sthanikam

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

Article Image

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ATMలను లక్ష్యంగా చేసుకుని లూటీకి పాల్పడిన దొంగల ముఠా హైదరాబాద్ వైపు వస్తోందన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్యాల వద్ద జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీలను గమనించిన దొంగలు తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారు ప్రయాణిస్తున్న కారును చిట్యాల శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని AP 40 FL 0512 నంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News