Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:18 PM

నల్గొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

నల్గొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

నల్గొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ  దాడులు
April 22, 2026 01:56 PM 207 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ: జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ సేవల పేరుతో సిబ్బంది ప్రజల నుండి అదనపు నగదు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

దాడుల సందర్భంగా కార్యాలయంలో ఉన్న పలు ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు, చెల్లింపుల విధానం, అధికారిక రికార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.

అలాగే, అధికారిక సిబ్బంది కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఏసీబీ ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది. ఆన్‌లైన్ చెల్లింపుల పేరిట ప్రైవేట్ ఖాతాలకు డబ్బులు వెళ్లాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.ఈ దాడులతో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పూర్తి స్థాయి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు సూచిస్తున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News