Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

నకిరేకల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – ARRIVE-ALIVEపై దృష్టి

నకిరేకల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – ARRIVE-ALIVEపై దృష్టి

నకిరేకల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – ARRIVE-ALIVEపై దృష్టి
15-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగిన “ARRIVE-ALIVE” కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణనష్టం తగ్గుతుందని తెలిపారు.డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్స్ పాత్ర ఉండటంతో హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. కార్లలో సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని తెలిపారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ARRIVE-ALIVE కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో హైవేపై అవసరమైన వంతెనల నిర్మాణం చేపడతామని తెలిపారు.

Sthanikam

నకిరేకల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – ARRIVE-ALIVEపై దృష్టి

Article Image

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగిన “ARRIVE-ALIVE” కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణనష్టం తగ్గుతుందని తెలిపారు.డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్స్ పాత్ర ఉండటంతో హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. కార్లలో సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని తెలిపారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ARRIVE-ALIVE కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో హైవేపై అవసరమైన వంతెనల నిర్మాణం చేపడతామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News