PRINT TIME: April 15, 2026 02:55 PM
నకిరేకల్లో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం
నకిరేకల్లో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం
April 15, 2026 12:02 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, మండల విద్యాధికారి మేకల నాగయ్య, స్థానిక కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందిస్తున్నామని వివరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి