నకిరేకల్లో కాంగ్రెస్ శాంతియుత నిరసన.. కేంద్రంపై విప్ వేముల వీరేశం విమర్శలు
నకిరేకల్లో కాంగ్రెస్ శాంతియుత నిరసన.. కేంద్రంపై విప్ వేముల వీరేశం విమర్శలు
Komidala Mahender reddy
ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన లాఠీచార్జ్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలపై నమోదైన కేసులను నిరసిస్తూ నకిరేకల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై నమోదైన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, విద్యా వ్యవస్థ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు శాంతియుత నిరసనలు చేపట్టగా, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి