నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ
స్థానికం బృందం
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం
తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC) సూచనల మేరకు నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని ఎకో క్లబ్, బోటనీ విభాగం సంయుక్తంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష, బోటనీ విభాగాధిపతి కే. శివరాణి విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో డా. పి. సిద్ధేశ్ గౌడ్, డా. డి. కృష్ణ, ఇతర బోధన సిబ్బంది, విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని ఎకో క్లబ్ సభ్యులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి