Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 03:50 AM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ
March 07, 2026 04:46 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం

తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC) సూచనల మేరకు నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని ఎకో క్లబ్, బోటనీ విభాగం సంయుక్తంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష, బోటనీ విభాగాధిపతి కే. శివరాణి విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో డా. పి. సిద్ధేశ్ గౌడ్, డా. డి. కృష్ణ, ఇతర బోధన సిబ్బంది, విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని ఎకో క్లబ్ సభ్యులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News