నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పేపర్ క్రాఫ్ట్ వర్క్షాప్
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పేపర్ క్రాఫ్ట్ వర్క్షాప్
స్థానికం బృందం
నల్గొండ: విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పేపర్ క్రాఫ్ట్ వర్క్షాప్ నిర్వహించారు. జాతీయ గ్రీన్ కార్ప్స్ సూచనల మేరకు ఎన్జి కాలేజ్లోని ఈకో క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పర్యావరణంపై బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రకృతి సంపదలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వ్యర్థ పదార్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ సందర్భంగా ఈకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష పేపర్ క్రాఫ్ట్ ప్రాముఖ్యతను వివరించారు. పాత వార్తాపత్రికలు, మ్యాగజీన్లు, ఉపయోగించని కాగితాలను వినియోగించి అలంకరణ వస్తువులు, పూలు, గోడ అలంకరణలు తయారు చేయవచ్చని చెప్పారు. ఈ విధంగా “తగ్గింపు–మళ్లీ వినియోగం–పునర్వినియోగం” భావనను విద్యార్థులు ఆచరణలో పెట్టవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్జీసీ ప్రాజెక్ట్ లీడర్ రాజశేఖర్, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ ప్రత్యేక అతిథులుగా హాజరై విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పరంగి రవి, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మునుస్వామి, డాక్టర్ బత్తిని నాగరాజు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఈకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, డాక్టర్ పి. సిద్ధేశ్ గౌడ్, డాక్టర్ డి. కృష్ణతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి