రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గంగుల వెంకటరాజిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండలవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి