Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:09 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
March 29, 2026 09:17 AM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నా పేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన గుండాల దాసుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.31 వేల చెక్కు ఆదివారం అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దాసు, కోలుకుంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో మంజూరైన చెక్కును గ్రామంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల కృష్ణ గౌడ్, నవీన్ కుమార్ చేతుల మీదుగా బాధితుడికి అందించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ, నీల నరసింహం, బత్తిని వెంకటేశం, పెద్దోళ్ల మల్లేశం, యాదయ్య, లచ్చయ్య, బత్తుల మల్లేష్, దాసరి మల్లేష్, నిరంజన్, అలాగే గ్రామ పెద్దలు రామకృష్ణ, నరేష్ పాల్గొన్నారు.

ఈ సహాయం అందడంతో గుండాల దాసు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు మరియు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News