ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
Editor Desk
రామన్నా పేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన గుండాల దాసుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.31 వేల చెక్కు ఆదివారం అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దాసు, కోలుకుంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో మంజూరైన చెక్కును గ్రామంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల కృష్ణ గౌడ్, నవీన్ కుమార్ చేతుల మీదుగా బాధితుడికి అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ, నీల నరసింహం, బత్తిని వెంకటేశం, పెద్దోళ్ల మల్లేశం, యాదయ్య, లచ్చయ్య, బత్తుల మల్లేష్, దాసరి మల్లేష్, నిరంజన్, అలాగే గ్రామ పెద్దలు రామకృష్ణ, నరేష్ పాల్గొన్నారు.
ఈ సహాయం అందడంతో గుండాల దాసు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు మరియు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి