Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల హవా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం – అధికారులు మౌనం! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 01:30 PM

మోత్కూరు సింగిల్‌విండోలో రాత్రి రచ్చ

మోత్కూరు సింగిల్‌విండోలో రాత్రి రచ్చ

మోత్కూరు సింగిల్‌విండోలో రాత్రి రచ్చ
April 01, 2026 11:53 AM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చైర్మన్ ఛాంబర్‌లోనే మందు పార్టీ.. విలేకరులపై బెదిరింపులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రభుత్వ కార్యాలయ పరువు బజారున పడే ఘటన వెలుగులోకి వచ్చింది. రైతుల సేవ కోసం ఏర్పాటు చేసిన సింగిల్‌విండో కార్యాలయం, ఉద్యోగుల మందు పార్టీలకు వేదికగా మారింది. విధులు ముగిసిన తర్వాత కార్యాలయాన్ని మూసివేయాల్సిన ఉద్యోగులు, అర్థరాత్రి వరకు అదే కార్యాలయంలో మద్యం సేవిస్తూ హంగామా సృష్టించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

సమాచారం ప్రకారం, మోత్కూరు రైతుసేవా సహకార సంఘం (సింగిల్‌విండో) కార్యాలయంలో నలుగురు ఉద్యోగులు చైర్మన్ ఛాంబర్‌ను సిట్టింగ్ రూంగా మార్చుకుని మద్యం పార్టీ నిర్వహించారు. చైర్మన్ టేబుల్‌పైనే మందుబాటిళ్లు, తినుబండారాలు పెట్టుకుని తాగుతూ హద్దులు దాటారు. ఈ పార్టీలో నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంక్ మోత్కూరు బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి పృధ్వి, అడ్డగూడూరు సింగిల్‌విండో కంప్యూటర్ ఆపరేటర్ శివ కూడా పాల్గొన్నట్లు సమాచారం.ఈ వ్యవహారం తెలిసి అక్కడికి చేరుకున్న విలేకరులు ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించగా, అక్కడున్న ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. “ఫొటోలు తీసి ఏం చేస్తారు… ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాలకవర్గాల లేమి, పర్యవేక్షణ లోపం కారణంగానే ఉద్యోగులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రజా నమ్మకాన్ని దెబ్బతీసే ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News