మంత్రి వేముల వీరేశంకు ఘన సన్మానం వెలిమినేడు కాంగ్రెస్ నాయకుల శుభాభినందనలు.
మంత్రి వేముల వీరేశంకు ఘన సన్మానం వెలిమినేడు కాంగ్రెస్ నాయకుల శుభాభినందనలు.
Editor Desk
వెలిమినేడు: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి హోదా లభించడంతో వెలిమినేడు గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శాలువా కప్పి శుభాభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందిస్తున్న వేముల వీరేశంకు మంత్రి హోదా దక్కడం నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మంత్రి హోదాతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వెలిమినేడు ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్, వార్డు సభ్యుడు నోముల రామకుమార్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు చీమల వీరేశం, జిల్లా కాంగ్రెస్ నాయకుడు అంతటి పారిజాత నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి తాటికొండ సత్యనారాయణ, యాదవ సంఘం చైర్మన్ బైకాని నాగరాజు, నాయకులు కాటం సత్తయ్య, గోలి గణేష్, చింతకాయల శివకృష్ణ, నాతి స్వామి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి