మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లతోనే కోదాడ అభివృద్ధి సాధ్యం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లతోనే కోదాడ అభివృద్ధి సాధ్యం
Harish HS
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కోదాడ నియోజకవర్గం అభివృద్ధి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మారెడ్డి తోనే సాధ్యమవుతుందని కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన కోదాడ పట్టణ నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గార్ల నాయకత్వంలో వేలకోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి కోదాడ నియోజకవర్గం లో గడిచిన 30 సంవత్సరాల నుండి అవినీతి మచ్చ లేకుండా పాడన కొనసాగిస్తున్న ఘనత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి దక్కుతుందన్నారు.తాగునీరు సాగునీరు డ్రైనేజ్ సిసి రోడ్లు అన్ని గ్రామాలకు రోడ్లు సౌకర్యం తో పాటు విద్య వైద్యం ఇందిరామ్మ ఇల్లు తో ప్రజలకు బావితరాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రచించి ఎలాంటి వర్గ బేధాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.మచ్చలేని నాయకుల నాయకత్వంలో మనందరం పనిచేయడం అదృష్టమన్నారు నూతన పాలకవర్గ సభ్యులు కోదాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావితరాలకు ఉపయోగపడే విధంగా సంక్షేమమ్ అభివృద్ధిని అందించాలని వారిని ఆకాంక్షించారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లను మార్కెట్ చైర్మన్ పాలక సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపాలిటీ చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు వైస్ చైర్మన్ రాజేశ్వరి మున్సిపాలిటీ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వీరబాబు వేంకట్ రెడ్డి సూర్యం వేంకటేశ్వర్లు కోటయ్య మణెమ్మ నర్సిరెడ్డి శ్రీను అభిరామ్ శ్రీనివాస్ అమర్ సింగ్ వేణు తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి