Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 08:10 PM

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు
April 19, 2026 05:28 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

మేడే వారోత్సవాలను అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా నిర్వహించి విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో, గ్యాస్ తదితర రంగాల కార్మికులు తమ తమ కూడళ్లలో జెండాలు ఎగర వేసి, రైల్వే స్టేషన్‌ నుంచి పట్టణంలో ర్యాలీగా వచ్చి రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు నష్టదాయకమని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి రూ.25 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మేడే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, సిరిపంగి రవి, బొట్టు బాలనరసింహ, పడిగెల కుమార్, విజయ్, మాచర్ల సత్యమ్మ, కొమ్ము వరమ్మ, దేవరకొండ మంజుల, భాగ్యమ్మ, సునీత, శ్యామల, ఉడుత సోములు, కత్తెరపోయిన శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News