Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:21 PM

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు
19-04-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

మేడే వారోత్సవాలను అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా నిర్వహించి విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో, గ్యాస్ తదితర రంగాల కార్మికులు తమ తమ కూడళ్లలో జెండాలు ఎగర వేసి, రైల్వే స్టేషన్‌ నుంచి పట్టణంలో ర్యాలీగా వచ్చి రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు నష్టదాయకమని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి రూ.25 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మేడే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, సిరిపంగి రవి, బొట్టు బాలనరసింహ, పడిగెల కుమార్, విజయ్, మాచర్ల సత్యమ్మ, కొమ్ము వరమ్మ, దేవరకొండ మంజుల, భాగ్యమ్మ, సునీత, శ్యామల, ఉడుత సోములు, కత్తెరపోయిన శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

Article Image

భువనగిరి,

మేడే వారోత్సవాలను అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా నిర్వహించి విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో, గ్యాస్ తదితర రంగాల కార్మికులు తమ తమ కూడళ్లలో జెండాలు ఎగర వేసి, రైల్వే స్టేషన్‌ నుంచి పట్టణంలో ర్యాలీగా వచ్చి రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు నష్టదాయకమని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి రూ.25 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మేడే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, సిరిపంగి రవి, బొట్టు బాలనరసింహ, పడిగెల కుమార్, విజయ్, మాచర్ల సత్యమ్మ, కొమ్ము వరమ్మ, దేవరకొండ మంజుల, భాగ్యమ్మ, సునీత, శ్యామల, ఉడుత సోములు, కత్తెరపోయిన శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News