Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:21 AM

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు
April 19, 2026 05:28 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

మేడే వారోత్సవాలను అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా నిర్వహించి విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో, గ్యాస్ తదితర రంగాల కార్మికులు తమ తమ కూడళ్లలో జెండాలు ఎగర వేసి, రైల్వే స్టేషన్‌ నుంచి పట్టణంలో ర్యాలీగా వచ్చి రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు నష్టదాయకమని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి రూ.25 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మేడే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, సిరిపంగి రవి, బొట్టు బాలనరసింహ, పడిగెల కుమార్, విజయ్, మాచర్ల సత్యమ్మ, కొమ్ము వరమ్మ, దేవరకొండ మంజుల, భాగ్యమ్మ, సునీత, శ్యామల, ఉడుత సోములు, కత్తెరపోయిన శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News