మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు
మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు
Editor Desk
భువనగిరి,
మేడే వారోత్సవాలను అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా నిర్వహించి విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో, గ్యాస్ తదితర రంగాల కార్మికులు తమ తమ కూడళ్లలో జెండాలు ఎగర వేసి, రైల్వే స్టేషన్ నుంచి పట్టణంలో ర్యాలీగా వచ్చి రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు నష్టదాయకమని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి రూ.25 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మేడే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, సిరిపంగి రవి, బొట్టు బాలనరసింహ, పడిగెల కుమార్, విజయ్, మాచర్ల సత్యమ్మ, కొమ్ము వరమ్మ, దేవరకొండ మంజుల, భాగ్యమ్మ, సునీత, శ్యామల, ఉడుత సోములు, కత్తెరపోయిన శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి