మ్యారేజ్ బ్యూరోల సంక్షేమానికి ఐక్యంగా పోరాడాలి
మ్యారేజ్ బ్యూరోల సంక్షేమానికి ఐక్యంగా పోరాడాలి
K.RAVI
భువనగిరిలో టీజీఎస్ఎమ్ బిడబ్లుఏ సర్వసభ్య సమావేశం
మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ప్రధాన కార్యాలయంలో సంఘం సర్వసభ్య సమావేశం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరాల రుక్కారావు, గౌరవాధ్యక్షుడు శికలంబట్ల యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సంఘ బలోపేతం, సభ్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుణగంటి రాము గౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె జంగయ్య, రాష్ట్ర కోశాధికారి ఈసం యాదగిరి, కార్యదర్శి ముత్యం రాంచందర్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బోనగిరి రమేష్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది చంద్రయ్య గౌడ్, ఉపాధ్యక్షులు బోయ యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తుల పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శివ శంకర్, జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి మల్లేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు చిలకరాజు బుగ్గయ్య, గౌరవ సలహాదారులు సుర్కకంటి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి