Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:29 PM

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు
11-03-2026 806 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మార్చి 15న వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు తెలిపారు.

ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సురక్షితంగా నిల్వ చేయడం, ధాన్యాన్ని తడవకుండా కప్పివేయడం వంటి చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు.

మరోవైపు నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Sthanikam

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

Article Image

వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మార్చి 15న వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు తెలిపారు.

ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సురక్షితంగా నిల్వ చేయడం, ధాన్యాన్ని తడవకుండా కప్పివేయడం వంటి చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు.

మరోవైపు నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News