Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:57 AM

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు
March 11, 2026 02:06 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మార్చి 15న వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు తెలిపారు.

ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సురక్షితంగా నిల్వ చేయడం, ధాన్యాన్ని తడవకుండా కప్పివేయడం వంటి చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు.

మరోవైపు నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News