Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 04, 2026 08:34 PM

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం
March 04, 2026 06:22 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజిగిరిలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు తరచూ అకడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నేడు “రసాయన బంధం” అనే అంశంపై విస్తృతోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. లావణ్య హాజరై ఉపన్యసించారు.

డాక్టర్ ఆర్. లావణ్య రసాయన బంధాల స్వభావం, అయానిక్ మరియు కోవేలెంట్ బంధాల మధ్య తేడాలు, వాటి లక్షణాలు, అణువుల నిర్మాణంలో బంధాల ప్రాధాన్యత వంటి అంశాలను సులభంగా వివరించారు. రసాయన బంధాల అవగాహన ద్వారా ఔషధ తయారీ, పదార్థ శాస్త్రం, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను విద్యార్థులకు తెలియజేశారు. శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమం రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అడవి రాజు ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకులు జి. స్వాతి, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News