Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 02:04 PM

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం
March 04, 2026 06:22 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజిగిరిలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు తరచూ అకడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నేడు “రసాయన బంధం” అనే అంశంపై విస్తృతోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. లావణ్య హాజరై ఉపన్యసించారు.

డాక్టర్ ఆర్. లావణ్య రసాయన బంధాల స్వభావం, అయానిక్ మరియు కోవేలెంట్ బంధాల మధ్య తేడాలు, వాటి లక్షణాలు, అణువుల నిర్మాణంలో బంధాల ప్రాధాన్యత వంటి అంశాలను సులభంగా వివరించారు. రసాయన బంధాల అవగాహన ద్వారా ఔషధ తయారీ, పదార్థ శాస్త్రం, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను విద్యార్థులకు తెలియజేశారు. శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమం రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అడవి రాజు ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకులు జి. స్వాతి, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News