మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
Prabhakar
స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి ప్రభాకర్
మల్కాజ్గిరి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం గౌతమ్నగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ నగర్లో రూ.29 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత మల్కాజ్ గిరి సర్కిల్ దివ్య జ్యోతి , స్థానిక కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి