మల్కాజ్గిరి లో మిషన్ స్వచ్ఛభారత్
మల్కాజ్గిరి లో మిషన్ స్వచ్ఛభారత్
Prabhakar
స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్
మిషన్ స్వచ్ఛభారత్ లో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నేటి కార్యక్రమము ప్రజా మరుగుదొడ్లు పనితీరు మరియు ప్రజలు ఉపయోగించు కొవాలని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.కార్యక్రమంలో సంచిత్ గంగ్వార్ ఐఏఎస్ జోనల్ కమిషనర్ మల్కాజిగిరి వారు మల్కాజ్గిరి లోని బిఓటి టాయిలెట్ తనిఖీ చేయటం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నదని మనము మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అందుకు ప్రజలు సహకరించాలని కోరినారు, మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించుట జరిగినది. కార్యక్రమంలో
గంగాధర్ ఐఏఎస్ జోనల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందరూ మరుగుదొడ్లు ఉపయోగించాలని కోరినారు అదేవిధంగా ప్రతి షాపుయజమానిచెత్తబుట్టలనుఉపయోగించాలని తమ దుకాణంలోని చెత్తను రోడ్ల పైన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద వేయరాదని కోరినారు ఇంటిలోని చెత్తను జిహెచ్ఎంసి వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటో టిప్పర్ కు ఇవ్వాలని వారి సేవలను వినియోగించుకోవాలని ప్రతినెలా రూపాయలు 100/- చొప్పున ఇచ్చి చెత్త రహిత మల్కాజ్గిరి జోనుగా తీర్చిదిద్దాన్ని అందరి బాగా స్వామ్యం అవసరం ఉందని కోరినారు. కావాలని పదే పదే రోడ్ల పైన చెత్త వేసే దుకాణం యజమానులకు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని మరియు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించుతామని హెచ్చరించినారు, మరియు సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న బహిరంగ చెత్త వేయు ప్రాంతాన్ని తనిఖీ చేయడం సర్దార్ పటేల్ నగర్ కాలనీలో పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజలను స్వచ్ఛ ఆటో టిప్పర్ ప్రతీ రోజు వస్తున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు చెత్త సేకరించు చ్గున్నవా లేదా ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎన్ని సార్లు అవగాహన కల్పించినారు చెత్త ఇవ్వని ఇండ్లు ఎన్ని ఉన్నాయి అని స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్ ను అడిగి తెలుసికొన్నారు, స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రూవర్ ను కాలనీ లో ఎన్ని రోజులకు ఒక వేకతావు అని అడిగి తెలిసుకొన్నారు, రోడ్డు , కాలనీలలో ముఖ్యంగా పారిశుధ్యం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. హెచ్ యం డబ్లు ఎస్ వారు తీసిన సెల్ట్ ఇసుక ఇంకా ఎందుకు ఉన్నది వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తిలగించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరినారు విద్యుత్ స్తంభాలు విచ్చల విడిగా ఎందుకు వేసినారు అని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తొలగించే చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో సంచిత్ గంగాధర్ ఐఏఎస్ జోనల్ కమిషనర్ మల్కాజిగిరి, జకియా సుల్తానా డిప్యూటీ కమిషనర్, మహేష్ డి ఈ ఈ మౌనిక ఏ ఈ (ఎస్ డబ్ల్యూ ఎం) చింత శ్రీనివాస్ శానిటరీ సూపర్వైజర్ నర్సింగ్ రావు జవాన్ ఎల్లయ్య రాములు గిరి అలీ చిట్టిబాబు ఎస్ ఎఫ్ ఎ తదితరులు పాల్గొని మల్కాజ్గిరి లోని బిఓటి టాయిలెట్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి