మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలి: నీలం మధు ముదిరాజ్
మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలి: నీలం మధు ముదిరాజ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
తెలుగు ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి సందర్భంగా బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో యువకులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందడితో సంక్రాంతి పండుగ కనువిందు చేస్తుందని అన్నారు.
ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా పసిడి పంటలతో పరిఢవిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి