నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండలం: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన జన్మదిన సందర్భంగా సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్థానికం’ దినపత్రికను ఆవిష్కరించారు. పత్రిక యాజమాన్య బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే వేదికగా పత్రిక ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పత్రిక బృందానికి అభినందనలు తెలియజేసి, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని సర్పంచులు కునూరి సాయికుమార్ గౌడ్, కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, గర్దాస్ విక్రం, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు,రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి