Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:47 PM

మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు

మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు

మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు
06-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యటించారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలకు అన్ని గ్రామాలు ప్రాధాన్యతనిచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేసి ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు.

తరువాత గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, వారు ఏ తరగతుల్లో చదువుతున్నారో తెలుసుకున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్ రోజూ ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారని, గర్భిణీలు, బాలింతలు ఎంతమంది ఉన్నారని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతిరోజూ ఆహారం తీసుకుంటున్నారా, ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా అని ఆరా తీశారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న ఓ చిన్నారికి కలెక్టర్ అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు

Article Image

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యటించారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలకు అన్ని గ్రామాలు ప్రాధాన్యతనిచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేసి ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు.

తరువాత గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, వారు ఏ తరగతుల్లో చదువుతున్నారో తెలుసుకున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్ రోజూ ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారని, గర్భిణీలు, బాలింతలు ఎంతమంది ఉన్నారని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతిరోజూ ఆహారం తీసుకుంటున్నారా, ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా అని ఆరా తీశారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న ఓ చిన్నారికి కలెక్టర్ అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News