మహిళల భద్రతకు అవగాహనే శ్రీరామరక్ష - సీఐ మన్మధ కుమార్
మహిళల భద్రతకు అవగాహనే శ్రీరామరక్ష - సీఐ మన్మధ కుమార్
K.RAVI
మహిళలు తమ భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో ధైర్యంతో పోలీసుల సహాయం పొందాలని చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ జి.మన్మధ కుమార్ సూచించారు. ధర్మోజీగూడెం గ్రామంలోని 'సినర్జీ' కంపెనీ ప్రాంగణంలో గురువారం మహిళల భద్రత, హక్కులు, స్వీయ రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను ఎలా వినియోగించుకోవాలి, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాలు, హెల్ప్లైన్ నంబర్ల ప్రాధాన్యతను వివరించారు. అలాగే రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమగ్రంగా తెలియజేశారు. మహిళల భద్రతకు అవగాహన, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తితో పాటు సరైన సమయంలో పోలీసులను సంప్రదించడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సదస్సులో పాల్గొన్న మహిళలు తమకున్న పలు అనుమానాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి