Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:56 AM

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం
07-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఉద్యోగినుల విధి నిర్వహణ అభినందనీయం : టీజీఎస్ ఆర్టీసీ విసి & ఎం.డి వై.నాగిరెడ్డి కితాబు

ఇంటాబయటా అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా మహిళా సిబ్బంది విధి నిర్వహణ మాత్రం బాధ్యతాయుతంగా చేస్తున్నారని టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై.నాగిరెడ్డి ఐ.పి.ఎస్ అన్నారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్ భవన్ లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఈతరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటిచెబుతుండటం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు.

అదేవిధంగా అవకాశాలు కల్పించడంలో అడా,మగ తేడా చూపకూడదని... స్త్రీ లేకపోతే ఈ సృష్టే లేదని, మహిళలకు మానసిక స్థైర్యం ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సంస్థ మనది... ఆర్టీసీ సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఫైనాన్స్ అడ్వైజర్ శ్రీమతి విజయపుష్ప కేక్ కట్ చేసి మహిళ ఉద్యోగులకు కేక్ తినిపించారు. అనంతరం మహిళ ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈడీలు .వి.మునిశేఖర్ , సి.హెచ్.వెంకన్న , సి.పి.ఎం , శ్రీదేవి , సీఈ (ఐటీ) శ్ వి.శ్రీదేవి , తదితర మహిళా అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.



Sthanikam

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం

Article Image

ఉద్యోగినుల విధి నిర్వహణ అభినందనీయం : టీజీఎస్ ఆర్టీసీ విసి & ఎం.డి వై.నాగిరెడ్డి కితాబు

ఇంటాబయటా అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా మహిళా సిబ్బంది విధి నిర్వహణ మాత్రం బాధ్యతాయుతంగా చేస్తున్నారని టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై.నాగిరెడ్డి ఐ.పి.ఎస్ అన్నారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్ భవన్ లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఈతరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటిచెబుతుండటం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు.

అదేవిధంగా అవకాశాలు కల్పించడంలో అడా,మగ తేడా చూపకూడదని... స్త్రీ లేకపోతే ఈ సృష్టే లేదని, మహిళలకు మానసిక స్థైర్యం ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సంస్థ మనది... ఆర్టీసీ సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఫైనాన్స్ అడ్వైజర్ శ్రీమతి విజయపుష్ప కేక్ కట్ చేసి మహిళ ఉద్యోగులకు కేక్ తినిపించారు. అనంతరం మహిళ ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈడీలు .వి.మునిశేఖర్ , సి.హెచ్.వెంకన్న , సి.పి.ఎం , శ్రీదేవి , సీఈ (ఐటీ) శ్ వి.శ్రీదేవి , తదితర మహిళా అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News