మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం
మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం
Prabhakar
ఉద్యోగినుల విధి నిర్వహణ అభినందనీయం : టీజీఎస్ ఆర్టీసీ విసి & ఎం.డి వై.నాగిరెడ్డి కితాబు
ఇంటాబయటా అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా మహిళా సిబ్బంది విధి నిర్వహణ మాత్రం బాధ్యతాయుతంగా చేస్తున్నారని టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై.నాగిరెడ్డి ఐ.పి.ఎస్ అన్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్ భవన్ లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఈతరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటిచెబుతుండటం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు.
అదేవిధంగా అవకాశాలు కల్పించడంలో అడా,మగ తేడా చూపకూడదని... స్త్రీ లేకపోతే ఈ సృష్టే లేదని, మహిళలకు మానసిక స్థైర్యం ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సంస్థ మనది... ఆర్టీసీ సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఫైనాన్స్ అడ్వైజర్ శ్రీమతి విజయపుష్ప కేక్ కట్ చేసి మహిళ ఉద్యోగులకు కేక్ తినిపించారు. అనంతరం మహిళ ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈడీలు .వి.మునిశేఖర్ , సి.హెచ్.వెంకన్న , సి.పి.ఎం , శ్రీదేవి , సీఈ (ఐటీ) శ్ వి.శ్రీదేవి , తదితర మహిళా అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి