Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 10:02 PM

మహిళా సాధికారతే లక్ష్యం.. అన్ని రంగాల్లో మహిళలు పురోగమించాలి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త

మహిళా సాధికారతే లక్ష్యం.. అన్ని రంగాల్లో మహిళలు పురోగమించాలి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త

మహిళా సాధికారతే లక్ష్యం.. అన్ని రంగాల్లో మహిళలు పురోగమించాలి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త
March 12, 2026 07:56 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి ప్రధాన బలం అని, మహిళలందరూ అన్ని రంగాల్లో పురోగమిస్తూ సమాజ నిర్మాణంలో ముందుండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.

చైతన్యపురి కమ్యూనిటీ హాల్‌లో “ఓం శ్రీ మాత్రే నమః” సంస్థ ఆధ్వర్యంలో మంజుల నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవుల్లో 75 శాతం అవకాశాలు కల్పించిందన్నారు. మహిళలు పురుషులకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు విశేషమైన సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News