Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 06:20 AM

మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం

మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం

మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం
March 08, 2026 06:52 PM 230 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి ఆదివారం ఘనంగాసన్మానించారు. ఆయన ఆధ్వర్యంలో నార్కెట్‌పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి శాలువాలు కప్పి అభినందనలుతెలియజేశారు. కార్యక్రమంలో కేక్ కట్ చేయించి మహిళా పోలీసుల సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది విధుల పట్ల చూపుతున్న కర్తవ్యనిష్ఠ అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలతో పోలీస్ శాఖకు గౌరవం తీసుకొస్తున్నారని కొనియాడారు.కార్యక్రమంలో నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి, చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్‌తో పాటు ఇరు పోలీస్ స్టేషన్‌ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News