PRINT TIME: June 25, 2026 06:20 AM
మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం
మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం
March 08, 2026 06:52 PM
230 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నార్కెట్పల్లి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి ఆదివారం ఘనంగాసన్మానించారు. ఆయన ఆధ్వర్యంలో నార్కెట్పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి శాలువాలు కప్పి అభినందనలుతెలియజేశారు. కార్యక్రమంలో కేక్ కట్ చేయించి మహిళా పోలీసుల సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది విధుల పట్ల చూపుతున్న కర్తవ్యనిష్ఠ అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలతో పోలీస్ శాఖకు గౌరవం తీసుకొస్తున్నారని కొనియాడారు.కార్యక్రమంలో నార్కెట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి, చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్తో పాటు ఇరు పోలీస్ స్టేషన్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి