మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు
స్థానికం బృందం
యాదాద్రి–భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడా పోటీలను నిర్వహించింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల కోసం స్పీడ్ వాక్ (50 మీటర్లు), టెన్నికోయిట్ (సింగిల్), క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్ (సింగిల్) వంటి పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె. ధనంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎన్జీఓస్ జాయింట్ సెక్రటరీ ఆర్. శైలజతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల మహిళా అధికారులు, మహిళా సిబ్బంది సుమారు 200 మంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి దశరథ్ రెడ్డి, గోపాల్, పీడీలు, పీఈటీలు మరియు కార్యాలయ సిబ్బంది మురళి, జయ, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె. ధనంజనేయులు మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి