మహనీయుల జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి
మహనీయుల జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి
Editor Desk
యాదాద్రి భువనగిరి: జిల్లాలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు సూచనలు, సలహాలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 11న జ్యోతిబా పూలే, ఏప్రిల్ 14న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుల భేదాలు లేకుండా అన్ని వర్గాల నాయకులు, ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి సాహితీ, డీఎస్పీ రవీందర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, ఈడీఎస్సీ కార్పొరేషన్ శ్యాంసుందర్, వివిధ సంఘాల నాయకులు, ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి