Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:37 PM

మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింతా బాబు మాదిగ........

మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింతా బాబు మాదిగ........

మాదిగ  కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింతా బాబు మాదిగ........
March 03, 2026 08:25 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ వెల్లడి....

ఎమ్మార్పీఎస్ తెలంగాణ అనుబంధ విభాగమైన మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు చింతా బాబు మాదిగ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మేడి పాపన్న మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న చింతా బాబు సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఎస్సీల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందేలా భవిష్యత్తు కార్యచరణను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం చింతాబాబు మాదిగ మాట్లాడుతూ తనకు రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మాదిగ బిడ్డకు అండగా ఉండి న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News