Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:17 PM

మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింతా బాబు మాదిగ........

మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింతా బాబు మాదిగ........

మాదిగ  కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింతా బాబు మాదిగ........
March 03, 2026 08:25 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ వెల్లడి....

ఎమ్మార్పీఎస్ తెలంగాణ అనుబంధ విభాగమైన మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు చింతా బాబు మాదిగ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మేడి పాపన్న మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న చింతా బాబు సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఎస్సీల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందేలా భవిష్యత్తు కార్యచరణను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం చింతాబాబు మాదిగ మాట్లాడుతూ తనకు రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మాదిగ బిడ్డకు అండగా ఉండి న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News