Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 04:55 AM

మాధవరెడ్డి సేవలు చిరస్మరణీయం

మాధవరెడ్డి సేవలు చిరస్మరణీయం

మాధవరెడ్డి సేవలు చిరస్మరణీయం
March 07, 2026 11:36 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల లొ విగ్రహానికి ఘన నివాళులు

ప్రభుత్వపరంగా జయంతి, వర్ధంతులు నిర్వహించాలని డిమాండ్

చౌటుప్పల మున్సిపల్ కేంద్రంలో స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ మాధవరెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపిన మహానేత అని కొనియాడారు. చౌటుప్పల ప్రాంత అభివృద్ధికి కూడా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జ్, చౌటుప్పల మండల అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ మాధవరెడ్డి హోంమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్రంలోనే మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలను పేరుపేరునా పిలిచే నాయకుడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. వారి సేవలు ఎంత చెప్పినా తక్కువేనని, వారి ఆశయ సాధన కోసం చౌటుప్పల మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాధవరెడ్డి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని, తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ మహానాయకుడైన మాధవరెడ్డి జయంతి, వర్ధంతులను ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మాధవరెడ్డి జయంతి, వర్ధంతులను ప్రభుత్వపరంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, కొసనం రాకేష్ రెడ్డి, ఉడుగు జ్యోతి రమేష్, టిడిపి మండల పార్టీ ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు సుంకరి జంగయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేష్ గౌడ్, సామిడి రాఘవ రెడ్డి, తడక కోటేశ్వర్, యాట వెంకటేశం, పాశం రఘుపతి, గోవిందాచారి, గోశిక పాండు, చెరుకు అశోక్ గౌడ్, పబ్బు శ్రీనివాస్, దాచేపల్లి శ్రీమన్నారాయణ, అంతటి కిష్టయ్య, చెవగోని వెంకటేశం, చిన్నకొండూరు ఐలయ్య, ధర్మోజి గూడెం గుర్రం యాదగిరి, నేలపట్ల గుర్రం నరసింహ, మాజీ ఎంపీపీ వెలగ రాజశేఖర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ అంజయ్య గౌడ్, బిజెపి నాయకులు కంది లక్ష్మారెడ్డి, నల్ల గణేష్, రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News