Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:14 AM

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం    సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
April 03, 2026 08:43 PM 905 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నీర్నముల గ్రామంలో మద్యపాన నియంత్రణపై గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెరుగుతున్న మద్యం వినియోగం ఆందోళన కలిగిస్తోందని సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

సర్పంచ్ మాట్లాడుతూ, ఇటీవల ఒక దుకాణం వద్ద గమనించిన ఘటన తనను కలవరపరిచిందన్నారు. ఒక మహిళ పాల ప్యాకెట్ అడగగా, దుకాణదారు రహస్యంగా క్వార్టర్ మద్యం అందించడం చూసినట్లు చెప్పారు. అదే విధంగా మరికొందరికి కూడా మద్యం సరఫరా జరుగుతుండటం ప్రత్యక్షంగా గమనించానన్నారు.

గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే గ్రామంలో ప్రతిరోజూ సుమారు రూ.50 వేలకుపైగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, మహిళలు సైతం మద్యం వినియోగంలో ఉండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ఈ పరిస్థితి కొనసాగితే గ్రామానికి ప్రమాదం తప్పదని భావించి, గ్రామపంచాయతీ పాలకమండలి, ఉపసర్పంచ్, సభ్యులందరూ కలిసి మద్యపాన నిషేధంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రజలంతా ఈ నిర్ణయానికి సహకరించాలని సర్పంచ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. “మన గ్రామ భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందుకు రావాలి” అని ఆయన సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News