మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
Editor Desk
రామన్నపేట మండలంలోని నీర్నముల గ్రామంలో మద్యపాన నియంత్రణపై గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెరుగుతున్న మద్యం వినియోగం ఆందోళన కలిగిస్తోందని సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
సర్పంచ్ మాట్లాడుతూ, ఇటీవల ఒక దుకాణం వద్ద గమనించిన ఘటన తనను కలవరపరిచిందన్నారు. ఒక మహిళ పాల ప్యాకెట్ అడగగా, దుకాణదారు రహస్యంగా క్వార్టర్ మద్యం అందించడం చూసినట్లు చెప్పారు. అదే విధంగా మరికొందరికి కూడా మద్యం సరఫరా జరుగుతుండటం ప్రత్యక్షంగా గమనించానన్నారు.
గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే గ్రామంలో ప్రతిరోజూ సుమారు రూ.50 వేలకుపైగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, మహిళలు సైతం మద్యం వినియోగంలో ఉండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
ఈ పరిస్థితి కొనసాగితే గ్రామానికి ప్రమాదం తప్పదని భావించి, గ్రామపంచాయతీ పాలకమండలి, ఉపసర్పంచ్, సభ్యులందరూ కలిసి మద్యపాన నిషేధంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.
గ్రామ ప్రజలంతా ఈ నిర్ణయానికి సహకరించాలని సర్పంచ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. “మన గ్రామ భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందుకు రావాలి” అని ఆయన సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి