Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాజకీయాల్లో కొత్త మలుపు? జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 11:11 PM

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం    సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
April 03, 2026 08:43 PM 314 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నీర్నముల గ్రామంలో మద్యపాన నియంత్రణపై గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెరుగుతున్న మద్యం వినియోగం ఆందోళన కలిగిస్తోందని సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

సర్పంచ్ మాట్లాడుతూ, ఇటీవల ఒక దుకాణం వద్ద గమనించిన ఘటన తనను కలవరపరిచిందన్నారు. ఒక మహిళ పాల ప్యాకెట్ అడగగా, దుకాణదారు రహస్యంగా క్వార్టర్ మద్యం అందించడం చూసినట్లు చెప్పారు. అదే విధంగా మరికొందరికి కూడా మద్యం సరఫరా జరుగుతుండటం ప్రత్యక్షంగా గమనించానన్నారు.

గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే గ్రామంలో ప్రతిరోజూ సుమారు రూ.50 వేలకుపైగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, మహిళలు సైతం మద్యం వినియోగంలో ఉండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ఈ పరిస్థితి కొనసాగితే గ్రామానికి ప్రమాదం తప్పదని భావించి, గ్రామపంచాయతీ పాలకమండలి, ఉపసర్పంచ్, సభ్యులందరూ కలిసి మద్యపాన నిషేధంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రజలంతా ఈ నిర్ణయానికి సహకరించాలని సర్పంచ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. “మన గ్రామ భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందుకు రావాలి” అని ఆయన సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News