Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 PM

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఈవో కందుల సత్యనారాయణ

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఈవో కందుల సత్యనారాయణ

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఈవో కందుల సత్యనారాయణ
March 11, 2026 11:43 AM 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని, విద్యార్థులు మరియు యువత వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు.

మంగళవారం బీచ్ మహల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణకు ఏర్పాటు చేసిన ప్రహరీ క్లబ్ ఉపాధ్యాయులు, విద్యార్థుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా నాశనమై రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు.

మాదకద్రవ్యాల ద్వారా కలిగే తాత్కాలిక ఆనందం కంటే జీవితంలో విజయాన్ని సాధించడం ద్వారా లభించే ఆనందం ఎంతో విలువైనదని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. చెడు అలవాట్లు ఉన్న వారితో దూరంగా ఉంటే జీవితం మరింత మంచిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట, పాఠశాలలో ఉపాధ్యాయుల మాట వింటూ జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పరీక్షలపై భయాన్ని విడిచి పట్టుదలతో చదవాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచీ చెడూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి అన్నారు. విద్యార్థి తీసుకునే నిర్ణయంతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రామచంద్రం, షీ టీం సభ్యులు వరలక్ష్మి, రిసోర్స్ టీచర్లు ఎం. అనిత, జి. రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News