Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:10 AM

లో వోల్టేజ్‌కు చెక్… రైతులకు ఊరట ధర్మోజిగూడెంలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

లో వోల్టేజ్‌కు చెక్… రైతులకు ఊరట ధర్మోజిగూడెంలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

లో వోల్టేజ్‌కు చెక్… రైతులకు ఊరట ధర్మోజిగూడెంలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
March 06, 2026 07:50 PM 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజిగూడెం గ్రామ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల వద్ద ఉన్న 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లో లో వోల్టేజ్ సమస్య కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కొత్త 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించారు అని చెప్పారు.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల రైతులకు లో వోల్టేజ్ సమస్య తొలగి, వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, రైతులు బత్తుల శ్రీహరి, ఐతరాజు సత్తయ్య, ఊదరి శంకర్, ఐతరాజు శ్రీనివాస్, రాచకొండ కృష్ణయ్య, కొంతం మాధవ రెడ్డి, కొంతం లక్ష్మారెడ్డి, ఐతరాజు శంకర్, పక్కీరు జయలక్ష్మి, కన్నెమోని సుగుణమ్మ, ఐతరాజు బక్కయ్య, కన్నెమోని శ్రీనివాస్, దాసరి శేఖర్, గునుగంటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News