లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి
లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి
Editor Desk
ఎల్బీ నగర్, మహిళా వేధింపుల కేసు క్లోజ్ చేయించేందుకు లంచం తీసుకుంటూ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు.
కేసును లోక్ అదాలత్ ద్వారా ముగించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు పల్లపు రాంబాబు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
ముందస్తు ప్రణాళికతో కోర్టు ప్రాంగణంలో ట్రాప్ ఏర్పాటు చేసిన అధికారులు, బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం.363/2025కు సంబంధించి ఈ ఘటన చోటుచేసుకుంది. కాంప్రమైజ్ అయిన కేసును క్లోజ్ చేయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనతో పోలీస్ శాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి