Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 PM

లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి

లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి

లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి
April 02, 2026 01:50 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీ నగర్, మహిళా వేధింపుల కేసు క్లోజ్ చేయించేందుకు లంచం తీసుకుంటూ చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు.

కేసును లోక్ అదాలత్ ద్వారా ముగించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు పల్లపు రాంబాబు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

ముందస్తు ప్రణాళికతో కోర్టు ప్రాంగణంలో ట్రాప్ ఏర్పాటు చేసిన అధికారులు, బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం.363/2025కు సంబంధించి ఈ ఘటన చోటుచేసుకుంది. కాంప్రమైజ్ అయిన కేసును క్లోజ్ చేయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనతో పోలీస్ శాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News