Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:49 AM

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!
March 08, 2026 03:30 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమతం శ్రావణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో భారీ మొత్తంలో బంగారం, నగదు, ఆస్తి పత్రాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం ఆయన వద్ద నుంచి రెండు ఇళ్లు, ఒక అపార్ట్మెంట్‌లో ఆరు ఫ్లాట్లు, కరీంనగర్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. అలాగే కారు, బైక్‌తో పాటు భారీగా బంగారం, లెక్కకు మించిన నగదు, విలాసవంతమైన గృహోపకరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News