Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 09, 2026 07:56 AM

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!
March 08, 2026 03:30 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమతం శ్రావణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో భారీ మొత్తంలో బంగారం, నగదు, ఆస్తి పత్రాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం ఆయన వద్ద నుంచి రెండు ఇళ్లు, ఒక అపార్ట్మెంట్‌లో ఆరు ఫ్లాట్లు, కరీంనగర్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. అలాగే కారు, బైక్‌తో పాటు భారీగా బంగారం, లెక్కకు మించిన నగదు, విలాసవంతమైన గృహోపకరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News