లలిత కుమారి విన్నపం: ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలి
లలిత కుమారి విన్నపం: ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలి
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ
అధికారి కేతావత్ లలిత కుమారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ అనర్థాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.గత ఏడాది సంగారెడ్డి జిల్లాలో మొత్తం 62 బాల్య వివాహాలను ముందుగానే గుర్తించి జరగకుండా నిలిపివేశామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరగబోతున్నట్టు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు.బాలికలు చదువులో, క్రీడల్లో రాణిస్తూ జీవితంలో ముందుండాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా సంక్షేమ శాఖను సంప్రదించాలని ఆమె సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి