కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి
కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి
స్థానికం బృందం
ఆదోనిలో ఎన్డీఏ కూటమిని దెబ్బతీయాలని వైఎస్సార్సీపీ కుట్ర పన్నుతోందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆరోపించారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తను స్వయంగా కలిసిన ఆయన, పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు.
జనసేన కార్యకర్త సాయికుమార్ సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గంట వ్యవధిలోనే స్పందించిన ఎమ్మెల్యే పార్థసారధి, ఆయనను ప్రత్యక్షంగా కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అసంతృప్తి ఉన్న కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బలంగా కొనసాగుతుందని, ఇంకా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమిని బలహీనపరచాలని చూస్తున్న వైఎస్సార్సీపీ కుట్రలను కార్యకర్తలు తిప్పికొడతారని అన్నారు.
ఆదోనిలో కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేరని ఎమ్మెల్యే పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి