Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:08 AM

కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి

కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి

కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి
14-03-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోనిలో ఎన్డీఏ కూటమిని దెబ్బతీయాలని వైఎస్సార్సీపీ కుట్ర పన్నుతోందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆరోపించారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తను స్వయంగా కలిసిన ఆయన, పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు.

జనసేన కార్యకర్త సాయికుమార్ సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గంట వ్యవధిలోనే స్పందించిన ఎమ్మెల్యే పార్థసారధి, ఆయనను ప్రత్యక్షంగా కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అసంతృప్తి ఉన్న కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి బలంగా కొనసాగుతుందని, ఇంకా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమిని బలహీనపరచాలని చూస్తున్న వైఎస్సార్సీపీ కుట్రలను కార్యకర్తలు తిప్పికొడతారని అన్నారు.

ఆదోనిలో కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేరని ఎమ్మెల్యే పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Sthanikam

కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి

Article Image

ఆదోనిలో ఎన్డీఏ కూటమిని దెబ్బతీయాలని వైఎస్సార్సీపీ కుట్ర పన్నుతోందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆరోపించారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తను స్వయంగా కలిసిన ఆయన, పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు.

జనసేన కార్యకర్త సాయికుమార్ సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గంట వ్యవధిలోనే స్పందించిన ఎమ్మెల్యే పార్థసారధి, ఆయనను ప్రత్యక్షంగా కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అసంతృప్తి ఉన్న కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి బలంగా కొనసాగుతుందని, ఇంకా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమిని బలహీనపరచాలని చూస్తున్న వైఎస్సార్సీపీ కుట్రలను కార్యకర్తలు తిప్పికొడతారని అన్నారు.

ఆదోనిలో కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేరని ఎమ్మెల్యే పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News