Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 08:17 PM

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య
April 19, 2026 05:31 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కురుమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ బీరప్ప కామరాతి ఆలయంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.

మాజీ సంఘం అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, ఎన్నికల అధికారి కల్లేపల్లి శ్రీశైలం, ఉపసర్పంచ్ చిన్నం మల్లయ్య పర్యవేక్షణలో సభ్యులందరూ కలిసి నూతన కమిటీని ఎంపిక చేశారు. సంఘ అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా జోగు మహేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ… సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన అచ్చిన మల్లయ్యను సభ్యులు ఘనంగా సత్కరించారు.

అచ్చిన మల్లయ్య మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా చైతన్యవంతులై ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కురుమల హక్కుల సాధనకు, వారి అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

అనంతరం యువజన కమిటీని కూడా ఎన్నుకోగా, అధ్యక్షుడిగా గుజ్జ సిద్ధులు, ప్రధాన కార్యదర్శిగా జోగు భాను ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో గోధుమ బీరయ్య, జోగు చంద్రయ్య, వార్డు సభ్యులు చిన్నం మల్లేష్, కళ్లే వినోద్, అచ్చిన కృష్ణస్వామి, ఒగ్గు నవీన్, ఏడపల్లి మహేష్, జోగు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News