Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:29 PM

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య
19-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కురుమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ బీరప్ప కామరాతి ఆలయంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.

మాజీ సంఘం అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, ఎన్నికల అధికారి కల్లేపల్లి శ్రీశైలం, ఉపసర్పంచ్ చిన్నం మల్లయ్య పర్యవేక్షణలో సభ్యులందరూ కలిసి నూతన కమిటీని ఎంపిక చేశారు. సంఘ అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా జోగు మహేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ… సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన అచ్చిన మల్లయ్యను సభ్యులు ఘనంగా సత్కరించారు.

అచ్చిన మల్లయ్య మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా చైతన్యవంతులై ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కురుమల హక్కుల సాధనకు, వారి అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

అనంతరం యువజన కమిటీని కూడా ఎన్నుకోగా, అధ్యక్షుడిగా గుజ్జ సిద్ధులు, ప్రధాన కార్యదర్శిగా జోగు భాను ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో గోధుమ బీరయ్య, జోగు చంద్రయ్య, వార్డు సభ్యులు చిన్నం మల్లేష్, కళ్లే వినోద్, అచ్చిన కృష్ణస్వామి, ఒగ్గు నవీన్, ఏడపల్లి మహేష్, జోగు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య

Article Image

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కురుమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ బీరప్ప కామరాతి ఆలయంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.

మాజీ సంఘం అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, ఎన్నికల అధికారి కల్లేపల్లి శ్రీశైలం, ఉపసర్పంచ్ చిన్నం మల్లయ్య పర్యవేక్షణలో సభ్యులందరూ కలిసి నూతన కమిటీని ఎంపిక చేశారు. సంఘ అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా జోగు మహేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ… సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన అచ్చిన మల్లయ్యను సభ్యులు ఘనంగా సత్కరించారు.

అచ్చిన మల్లయ్య మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా చైతన్యవంతులై ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కురుమల హక్కుల సాధనకు, వారి అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

అనంతరం యువజన కమిటీని కూడా ఎన్నుకోగా, అధ్యక్షుడిగా గుజ్జ సిద్ధులు, ప్రధాన కార్యదర్శిగా జోగు భాను ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో గోధుమ బీరయ్య, జోగు చంద్రయ్య, వార్డు సభ్యులు చిన్నం మల్లేష్, కళ్లే వినోద్, అచ్చిన కృష్ణస్వామి, ఒగ్గు నవీన్, ఏడపల్లి మహేష్, జోగు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News