కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి
కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి
Editor Desk
ఆదోని: గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. పట్టణంలో కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు తిప్పన్న, వీరారెడ్డి, వీరేష్ మాట్లాడుతూ… గృహ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుని 15 నుంచి 20 రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని తెలిపారు. సింగిల్ సిలిండర్పై ఆధారపడే పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వంట చెరుకు కూడా అందుబాటులో లేక ప్రజలు ఇళ్లలో వంట చేయలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. గ్యాస్ కొరతతో చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి