Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:09 PM

కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి

కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి

కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి
30-03-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. పట్టణంలో కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు తిప్పన్న, వీరారెడ్డి, వీరేష్ మాట్లాడుతూ… గృహ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుని 15 నుంచి 20 రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని తెలిపారు. సింగిల్ సిలిండర్‌పై ఆధారపడే పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వంట చెరుకు కూడా అందుబాటులో లేక ప్రజలు ఇళ్లలో వంట చేయలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. గ్యాస్ కొరతతో చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Sthanikam

కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి

Article Image

ఆదోని: గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. పట్టణంలో కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు తిప్పన్న, వీరారెడ్డి, వీరేష్ మాట్లాడుతూ… గృహ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుని 15 నుంచి 20 రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని తెలిపారు. సింగిల్ సిలిండర్‌పై ఆధారపడే పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వంట చెరుకు కూడా అందుబాటులో లేక ప్రజలు ఇళ్లలో వంట చేయలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. గ్యాస్ కొరతతో చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News