Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 02:27 AM

కొయ్యదొర వేషధారణలో డ్రగ్స్‌పై వినూత్న అవగాహన

కొయ్యదొర వేషధారణలో డ్రగ్స్‌పై వినూత్న అవగాహన

కొయ్యదొర వేషధారణలో డ్రగ్స్‌పై వినూత్న అవగాహన
March 08, 2026 09:21 PM 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాదకద్రవ్యాలు, గంజాయి వినియోగంపై యువతకు అవగాహన కల్పించేందుకు కొయ్యదొర వేషధారణలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జెడ్ పి హెచ్ ఎస్ గోరంట్ల పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆదివారం జరిగే వారసంత సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.‘కుర్రో కుర్రో… బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, సమ్మక్క సారక్క పలుకు, శ్రీశైలం మల్లన్న పలుకు, కొరివి వీరన్న పలుకు’ అంటూ కొయ్యదొర వేషధారణలో ప్రజలను ఆకట్టుకుంటూ మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని తెలిపారు. యువత వాటికి దూరంగా ఉండి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడి విజయం సాధించి తల్లిదండ్రులు, గురువులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

‘నో డ్రగ్స్ – సేవ్ లైఫ్’ అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ మైక్ సెట్, ఫ్లెక్సీల ద్వారా డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు.

మరుగున పడుతున్న జానపద కళలను కాపాడటం కూడా తన బాధ్యతగా భావించి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News