Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 06, 2026 03:34 PM

కొత్తగూడెం , గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలనీ; బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

కొత్తగూడెం , గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలనీ; బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

కొత్తగూడెం , గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలనీ; బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా
March 06, 2026 12:20 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో కొత్తగూడెం నుండి గోరంట్ల గ్రామం వరకు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారంఅర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... గత కెసిఆర్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గాదరికిశోర్ ప్రత్తిపాధనలో రోడ్డు మంజూరూ చేశారు. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్ హడాఉడిగా శంకస్థాపన చేసి రెండేండ్లయిన ఇంతవరకు పనులు ప్రారంభించా లేక పోయారని అన్నారు. అలాగే మండలం లోని తుంగతుర్తి,వెంపటి,తూర్పుగూడెం, వెంపటి,బంధారామారం.,గుండెపురి, బండరామారం రోడ్లను వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు గుండ గానిరాములుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం, సర్పంచ్ మేడదుల రమేష్. ఉపసర్పంచ్ మహేష్, నాయకులు సిమ్మద్రి,కరుణాకర్.,కేశవరెడ్డి,సత్యనారాయణ,పాపులు. సందీప్. ప్రవీణ్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News