Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:25 PM

కొనుగోలు కేంద్రాలు తెరిచి… కొనుగోళ్లు ఎక్కడ...?

కొనుగోలు కేంద్రాలు తెరిచి… కొనుగోళ్లు ఎక్కడ...?

కొనుగోలు కేంద్రాలు తెరిచి… కొనుగోళ్లు ఎక్కడ...?
19-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుతిల్ ఖర్చులు రైతులపై భారం వద్దు. మేక అశోక్ రెడ్డి.

రామన్నపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను తక్షణమే అలాట్ చేసి ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సుతిల్ దారం ఖర్చులను రైతులపై మోపకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే భరించాలని స్పష్టం చేశారు.

స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు జరగకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికే సుమారు 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు చేరిందని, మిల్లుల అలాట్‌మెంట్ ఆలస్యం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు.

ప్రభుత్వం ప్రతి క్వింటాల్‌కు సుతిల్ దారం ఖర్చుల కోసం రూ.5 చెల్లిస్తున్నప్పటికీ, నిర్వాహకులు రైతులకు అందించడం లేదని ఆరోపించారు. మండలంలో సుమారు 8 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి ఉంటుందని, ప్రతి క్వింటాల్‌కు రూ.32 కమిషన్ నిర్వాహకులకు లభిస్తున్నదని పేర్కొన్నారు. ముందుగా రైతులకు సుతిల్ దారం అందించి, తర్వాత ప్రభుత్వం చెల్లించే డబ్బులు తీసుకోవాలని సూచించారు.

అకాల వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించి, కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లారీలు, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని తెలిపారు.

ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు గొరిగే సోములు, అప్పం సురేందర్, పాలెం అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కొనుగోలు కేంద్రాలు తెరిచి… కొనుగోళ్లు ఎక్కడ...?

Article Image

సుతిల్ ఖర్చులు రైతులపై భారం వద్దు. మేక అశోక్ రెడ్డి.

రామన్నపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను తక్షణమే అలాట్ చేసి ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సుతిల్ దారం ఖర్చులను రైతులపై మోపకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే భరించాలని స్పష్టం చేశారు.

స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు జరగకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికే సుమారు 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు చేరిందని, మిల్లుల అలాట్‌మెంట్ ఆలస్యం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు.

ప్రభుత్వం ప్రతి క్వింటాల్‌కు సుతిల్ దారం ఖర్చుల కోసం రూ.5 చెల్లిస్తున్నప్పటికీ, నిర్వాహకులు రైతులకు అందించడం లేదని ఆరోపించారు. మండలంలో సుమారు 8 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి ఉంటుందని, ప్రతి క్వింటాల్‌కు రూ.32 కమిషన్ నిర్వాహకులకు లభిస్తున్నదని పేర్కొన్నారు. ముందుగా రైతులకు సుతిల్ దారం అందించి, తర్వాత ప్రభుత్వం చెల్లించే డబ్బులు తీసుకోవాలని సూచించారు.

అకాల వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించి, కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లారీలు, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని తెలిపారు.

ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు గొరిగే సోములు, అప్పం సురేందర్, పాలెం అంజయ్య తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News