కోదాడలో శబ్ద కాలుష్యానికి చెక్.. రోడ్డు రోలర్తో సైలెన్సర్లు ధ్వంసం.....
కోదాడలో శబ్ద కాలుష్యానికి చెక్.. రోడ్డు రోలర్తో సైలెన్సర్లు ధ్వంసం.....
Harish K
అతివేగంగా పెద్ద శబ్దాలతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులు పెడితే సహించం.
యువత ఆదర్శంగా ఉంటూ ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.
నిబంధనలకు విరుద్ధంగా బుల్లెట్ బైక్లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వాహనదారులపై కోదాడ పట్టణ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 40 బుల్లెట్ బైక్లను గుర్తించి వాటి మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని మంగళవారం రంగా థియేటర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సమక్షంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..మితిమీరిన శబ్దాలు చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, రోగులు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ సైలెన్సర్లను మాత్రమే వాడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. యువత ఆదర్శంగా ఉండాలి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ శివ శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి