కోదాడలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
కోదాడలో సోమవారం సాంఘిక శాస్త్రం పరీక్షతో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. కోదాడ పట్టణంలోని 11 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2430 మంది విద్యార్థులకు గాను 2429 మంది చివరి పరీక్షకు హాజరయ్యారు.సుమారు నెల రోజుల పాటు జరిగిన పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు ఆనందోత్సాహాలతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి