Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 01:43 PM

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము
March 04, 2026 07:48 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రెడ్లకుంట ఎత్తిపోతల ప్రాజెక్టును మే నెల చివరి వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలి


రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

రెడ్లకుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడవద్దని మే నెల చివరి వరకు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ,కాంట్రాక్టర్ లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం పాలేరు వాగుపై రెడ్లకుంట వద్ద నిర్మిస్తున్న రెడ్ల కుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను అధికారులతో కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. తదుపరి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజక వర్గంలో పలు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల ప్రాజెక్టులు చేపట్టామని, రెడ్ల కుంట వద్ద రూ.14 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని , ఈ పథకం ద్వారా నల్లబండగూడెం, కాపుగల్లు, రెడ్ల కుంట పరిధిలో 4,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని అలాగే గ్రామాలలో త్రాగునీరు కూడ అందించడం జరుగుతుందని, ప్రాజెక్టు భూసేకరణ నిమిత్తం 3 ఎకరాల 39 కుంటల భూమి సేకరించి రైతులకు 2 కోట్లు చెల్లించనైనదని, ఈ ఖరీఫ్ సీజన్లో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో అత్యధిక వరి పంట పండి రికార్డ్స్ సృష్టించినదని, మొత్తం 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండినదని, రైతుల నుండి కొనుగోలు, బోనస్ మొత్తము కలిపి రూ.19,800 కోట్లు చెల్లించామని, రాజకీయాలకు అతీతంగా కోదాడ, హుజూర్నగర్ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్

సిఇ, రమేష్,ఆర్డిఓ సూర్య నారాయణ, నీటిపారుదల అధికారులు, గుత్తందారులు, అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News