కోదాడ లో ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయాలి.
కోదాడ లో ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయాలి.
Harish HS
విద్యార్థుల నమోదు లో భాగ స్వాములు కావాలీ.....
కోదాడ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
పాఠశాల లు లేని వార్డుల్లో పాఠశాల లు ఏర్పాటు చేయాలి.
టీఎస్ యూటీఎఫ్
కోదాడ లో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేయాలనీ టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు లు అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణం లో ఇటీవల కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ను ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే బడి బాట లో విద్యార్థుల నమోదు లో భాగ స్వాములు కావాలని కోరారు.
కోదాడ పట్టణం లో మౌలిక సదుపాయాలు రోడ్లు , ఫుట్ పాత్,మంచి నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలనీ కోరారు.పాఠశాల లు లేని వార్డుల్లో ప్రి ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం అందజేసారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల సహా కారం తో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జ్యోతి,పూర్వ జిల్లా అధ్యక్షుడు ఆర్ ధన మూర్తి, పూర్వ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కేఏ మంగ, ఆడిట్ కమిటీ సభ్యులు టి ఎ జనార్ధన్, జెవివి రాష్ట్ర నాయకులు చందా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సనత్ కుమార్, హమీద్,మండలాల బాధ్యులు మండవ ఉపేందర్,బాబు, వీరన్న,సైదులు, శక్రూ, నరసింహ రావు, రామ దాసు, గోపయ్య, తోడెటి బాబు,ఆంజనేయులు, బాల రాజు, మైశయ్య, శ్రీపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, తది తరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి