Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్ కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:50 PM

కోదాడ లో ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం....

కోదాడ లో ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం....

కోదాడ లో ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం....
April 13, 2026 08:01 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

విద్యారంగ సమస్యల పై టీఎస్ యూటీఎఫ్ రాజీలేని పోరాటం...

ప్రభుత్వ విద్యారంగ పరి రక్షణ కు యూటీఎఫ్ నిరంతర పోరాటం... జిల్లా కార్యదర్శులు నాగేశ్వరావు, పాండు రంగా చారి...


విద్యారంగ సమస్యల పై టీఎస్ యూటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఎన్ నాగేశ్వరరావు, పి పాండు రంగాచారి లు అన్నారు. సోమవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ లో టి ఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించి మాట్లాడారు.యూటీఎఫ్ ఆవిర్భావం నుండి నేటి వరకు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వ విద్యారంగ పరి రక్షణ కు యూటీఎఫ్ సభ్యులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా అనంత గిరి ఎంఇఓ తల్లాడ శ్రీనివాసరావు, చిలుకూరు ఎంఇఓ నరసింహ రెడ్డి లు యూటీఎఫ్ చేస్తున్న పోరాటాలను అభినందించారు. జిల్లా కోశాధికారి సీనియర్ నాయకులు టి. ఏ జనార్ధన్ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి జ్యోతి, సీనియర్ నాయకులు చందా శ్రీనివాసరావు, సనత్ కుమార్, పిడతల శ్రీని వాస్, డర్రా ఉపేందర్, రామారావు, లక్ష్మీ నారాయణ,శ్రీదేవి ,కోదాడ డివిజన్ బాధ్యులు మండవ ఉపేందర్, సత్తార్, బాబు, విక్రమ్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, బాల రాజు, శ్రీని వాస్ చారి, శ్రీ రంగా రాజు, సైది రెడ్డి, నందా, కిషోర్, బుల్లయ్య, కే శ్రీను తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News