Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 04:21 AM

కోదాడ లో ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం....

కోదాడ లో ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం....

కోదాడ లో ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం....
April 13, 2026 08:01 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

విద్యారంగ సమస్యల పై టీఎస్ యూటీఎఫ్ రాజీలేని పోరాటం...

ప్రభుత్వ విద్యారంగ పరి రక్షణ కు యూటీఎఫ్ నిరంతర పోరాటం... జిల్లా కార్యదర్శులు నాగేశ్వరావు, పాండు రంగా చారి...


విద్యారంగ సమస్యల పై టీఎస్ యూటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఎన్ నాగేశ్వరరావు, పి పాండు రంగాచారి లు అన్నారు. సోమవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ లో టి ఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించి మాట్లాడారు.యూటీఎఫ్ ఆవిర్భావం నుండి నేటి వరకు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వ విద్యారంగ పరి రక్షణ కు యూటీఎఫ్ సభ్యులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా అనంత గిరి ఎంఇఓ తల్లాడ శ్రీనివాసరావు, చిలుకూరు ఎంఇఓ నరసింహ రెడ్డి లు యూటీఎఫ్ చేస్తున్న పోరాటాలను అభినందించారు. జిల్లా కోశాధికారి సీనియర్ నాయకులు టి. ఏ జనార్ధన్ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి జ్యోతి, సీనియర్ నాయకులు చందా శ్రీనివాసరావు, సనత్ కుమార్, పిడతల శ్రీని వాస్, డర్రా ఉపేందర్, రామారావు, లక్ష్మీ నారాయణ,శ్రీదేవి ,కోదాడ డివిజన్ బాధ్యులు మండవ ఉపేందర్, సత్తార్, బాబు, విక్రమ్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, బాల రాజు, శ్రీని వాస్ చారి, శ్రీ రంగా రాజు, సైది రెడ్డి, నందా, కిషోర్, బుల్లయ్య, కే శ్రీను తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News